News December 31, 2024
మంచిర్యాల: రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కేజీబీవీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కడెం మెయిన్ కెనాల్లో పడిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాల్ని పోలీసులకు చేరవేసినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 19, 2025
ADB: విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు
విద్యుదాఘాతంతో బాలిక తీవ్ర గాయాలపాలైన ఘటన శనివారం ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన షేక్ తహ్రీం ఇంటి స్లాబ్ పై వెళ్లగా పైనుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో షాక్ కొట్టింది. దీంతో ఆమె చేయి, కాలుతో పాటు శరీరం ఒక పక్క దాదాపు 40 శాతం కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు స్ధానిక రిమ్స్కు తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
News January 18, 2025
‘రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి’
రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, ప్రధాన కార్యదర్శి రమేష్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ జట్టుకు శనివారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.
News January 18, 2025
ఈ యాప్తో నిరుద్యోగులకు ఎంతో మేలు: కలెక్టర్
నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్లో కళాశాలల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అధికారులు ఈ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. డైట్ యాప్లో తమ విద్యార్హతలతో పేరును నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వారికి అవసరమయ్యే ఉద్యోగులను నియమించుకుంటుందని చెప్పారు.