News February 6, 2025
మంచిర్యాల: షటిల్ ఆడుతూ గుండెపోటుతో అధ్యాపకుడి మృతి

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుడు బంధం బాపిరెడ్డి(50) గుండెపోటుతో ఈరోజు మరణించాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో నేటి ఉదయం షటిల్ ఆడుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మరణించినట్లుగా మృతుడి మిత్రులు తెలిపారు. అధ్యాపకుడి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News March 20, 2025
వనపర్తి: వృద్ధాప్య తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి: వి.రజని

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తిలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారి సంరక్షణకు హెల్ప్ లైన్ నంబర్ 14567ను ఏర్పాటు చేశామన్నారు.
News March 20, 2025
వ్యాపారవేత్త ఆలోచనతో మహిళలు ముందుకు సాగాలి: కలెక్టర్

ఖమ్మం: సమాజంలో సమానత్వం రావాలంటే మహిళలు అన్ని రంగాలలో నైపుణ్య వ్యాపారం చేస్తూ ఆర్థిక బలం సాధిస్తే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న మండల మహిళా సమాఖ్య భవనంలో ఉషోదయ, ఆదర్శ మహిళా సమాఖ్యలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యాపారవేత్త ఆలోచనా ధోరణితో మహిళలు ముందుకు సాగాలని పేర్కొన్నారు.
News March 20, 2025
ములుగు కలెక్టర్ కీలక ఆదేశాలు

ములుగు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గురువారం పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు ఎలాంటి కరెంటు కోతలు ఉండవద్దన్నారు.