News February 25, 2025
మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
Similar News
News December 8, 2025
ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితం: కలెక్టర్

ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలని, గోనె సంచులు తెచ్చుకున్న వారికి అధికారులే నగదు చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయించడానికి రైతులే స్వయంగా గోనె సంచులు తెచ్చుకుంటే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 8, 2025
సంగారెడ్డి: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినిగించుకోవాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి విడత ఎన్నికలు జరిగే సంగారెడ్డి, కంది, సదాశివపేట, గుమ్మడిదల, కొండాపూర్, పటాన్ చెరు, హత్నూర ఎంపీడీవో కార్యాలయాల్లో ఈనెల 9లోపు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పారు.
News December 8, 2025
బాపట్ల PGRSకు 65 అర్జీలు: DSP

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ PGRS నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 65 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్ట పరిధిలో వేగంగా పరిష్కరించాలని డీఎస్పీ సూచించారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని ఎస్పీ తెలిపారు.


