News February 25, 2025

మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

image

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.

Similar News

News October 21, 2025

ప్రకృతి గీసిన ‘నిడిగొండ’ చిత్రం

image

నీలి మేఘాల కింద కారుమబ్బులు అలుముకొని, అస్తమిస్తున్న సూర్యుడికి వాహనాల వెలుగులు దారి చూపుతున్నట్లు ఎంతో అద్భుతంగా ప్రకృతి గీసిన ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. రఘునాథ్ పల్లి మండలం నిడిగొండలో సోమవారం సాయంత్రం ఈ చిత్రం ఆవిష్కృతమైంది. స్థానికుడైన వెంకటేష్ తన ఫోన్లో బంధించి Way2Newsతో ఈ చిత్రాన్ని పంచుకున్నాడు.

News October 21, 2025

జనగామ: బెస్ట్ అవైలబుల్ చదువులకు తొలగిన అడ్డంకులు

image

బెస్ట్ అవైలబుల్ పథకం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు జిల్లాలోని 5 బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

News October 21, 2025

ఏపీ, టీజీ న్యూస్ రౌండప్

image

* మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి: TG సీఎం రేవంత్
* నవంబర్ 7న ఏపీ క్యాబినెట్ భేటీ
* ఖైరతాబాద్, శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
* నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి: రోజా
* హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 70 మందికి గాయాలు