News February 3, 2025

మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.

Similar News

News February 25, 2026

నేడు శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవాలు.. 25 రాత్రి అంకురార్పణ..!

image

శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవాలకు నేడు రాత్రి అంకురార్పణ జరగనుంది. 26ధ్వజారోహణం, 27సూర్యప్రభ వాహనం, 28శేష వాహనం, మార్చి 1న హనుమద్వాహన సేవ, మంటపోత్సవం, 2న మోహిని అలంకరణ సేవ, రాత్రి 8గంటలకు గరుడసేవ, 10గంటలకు కళ్యాణోత్సవం, 3న శ్రీవారి సేవ, గజవాహన సేవ, 4న ఉ. రా.10గంటలకు రథోత్సవం 5న అశ్వవాహన సేవ అరుణ చక్రస్నానం పూర్ణాహుతి ద్వజారోహణం శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన క్రతువులను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు.

News February 25, 2026

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 737 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 737 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ తెలిపారు. బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 20,364 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. 96.51 హాజరు శాతం నమోదు అయిందని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.

News February 25, 2026

NGKL: నాగర్ కర్నూల్‌లో కేటీఆర్ పర్యటన

image

బీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం మధ్య మాజీ మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూల్ చేరుకున్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన, ఆపై నేరుగా దీక్షా శిబిరానికి తరలివెళ్లారు. 58 రోజులుగా సాగుతున్న రిజర్వాయర్ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలుపుతూ, అక్కడి నాయకులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. బాధితుల పక్షాన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.