News February 3, 2025
మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
Similar News
News December 22, 2025
విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచండి: కలెక్టర్

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్)ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి వెళ్లాలని కోరారు.
News December 22, 2025
అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజలు అందించిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించి నివేదిక అందజేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News December 22, 2025
ALERT: పిల్లల ఆధార్ను అప్డేట్ చేశారా?

పిల్లల ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేయడం తప్పనిసరి అని UIDAI పేర్కొంది. 5- 15 ఏళ్లు నిండిన పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు, ఎగ్జామ్స్, ప్రభుత్వ పథకాల్లో ఇబ్బందులు రావొద్దంటే ఫింగర్ప్రింట్స్, ఫొటో అప్డేట్ చేయాలని సూచించింది. తల్లిదండ్రులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని X ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకూ ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.


