News February 3, 2025
మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
Similar News
News February 8, 2026
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు PGRS కార్యక్రమం

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉ.10.30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లాస్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.
News February 8, 2026
రేపు జానకీ జయంతి.. ఇలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం

శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జయంతి రేపు. దీనినే జానకీ జయంతి/సీతా అష్టమి అంటారు. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, తలస్నానం చేయాలి. పీటపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి సీతారాముల ఫొటో పెట్టి పూలతో అలంకరించాలి. ఎర్ర చీర, పూలు, గాజులు, సింధూరం సమర్పించి పూజించాలి. సీతారాముల అష్టోత్తరం చదవాలి. 5/9 మంది సుమంగళులకు పసుపు కుంకుమ, గాజులు, పూలు ఇచ్చి భోజనం పెట్టాలని పండితులు చెబుతున్నారు.
News February 8, 2026
NLG: 22 మంది ఎంఈఓలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 22 మంది మండల విద్యాధికారులపై (MEOs) నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 30 నాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో అలసత్వం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


