News March 21, 2024

మంచిర్యాల: BRSకు మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాక్

image

మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బాల్కసుమన్‌తో విభేదాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి BRS టికెట్టు రాకపోవటంతో ఆయన BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు రాలేదని పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడటం చెన్నూర్‌కి తీరని లోటని స్థానికులు భావిస్తున్నారు.

Similar News

News December 1, 2025

ADB: రామన్న.. సర్పంచ్ నుంచి మంత్రి వరకు

image

సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదగాలంటే రాజకీయాల్లో ఎంతో నిలదొక్కుకోవాలి. అలాంటి అవకాశమే మాజీ మంత్రి జోగు రామన్నను వరించింది. జోగు రామన్న జైనథ్ మండలంలోని దీపాయిగూడకు సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జడ్పీటీసీగా సేవలందించారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన స్వరాష్ట్ర సాధనలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. అనంతం జరిగిన మూడు ఎన్నికల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం KCR క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.

News December 1, 2025

ADB: నేటి నుంచి కొత్త వైన్స్ షాపులు ఓపెన్

image

జిల్లాలో ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం పాలసీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కొత్త పాలసీ ద్వారా ఎంపికైన నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి తెరచుకోనున్నాయి. జిల్లాలో మొత్తం 40 మద్యం షాపులు ఉండగా, ADB పరిధిలో 18, ఉట్నూర్ పరిధిలో 9, ఇచ్చోడ పరిధిలో 13 వైన్స్‌లు ఉన్నాయి. ADBలో ఈ ఏడాది కొత్తగా 3 లిక్కర్ మార్టులు ఏర్పాటు కానుండగా, వీటికి అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

News November 30, 2025

రెండో విడత నామినేషన్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

image

నేటి నుంచి రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు ఫారం నంబర్ -1 నుంచి 10 వరకు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి ఎక్కువ నామినేషన్లు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.