News February 24, 2025

మంచిర్యాల: CM రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి బయలు దేరి 11.50 నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి కరీంనగర్ బయలుదేరుతారు.

Similar News

News October 28, 2025

మధిర: NPDCLకు 2 ప్రతిష్ఠాత్మక ISO సర్టిఫికేట్లు ప్రదానం

image

NPDCLకు 2 ప్రతిష్ఠాత్మక ISO సర్టిఫికేట్లు లభించాయి. మధిరలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సర్టిఫికేట్లను సీఎండీకి అందజేశారు. నాణ్యమైన పంపిణీకి ISO 9001:2015, ఉద్యోగుల భద్రతా ప్రమాణాల అమలుకు ISO 45001:2018 సర్టిఫికేట్లు లభించాయని తెలిపారు. వీటిని హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సంస్థ జారీ చేసింది.

News October 28, 2025

తుఫాన్లలోనూ ఆగని విద్యుత్.. భూగర్భ కేబుల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

image

మధిర పట్టణంలో విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. మొత్తం 3.5 కి.మీ 33 కేవీ, 17.3 కి.మీ 11 కేవీ, 15 కి.మీ ఎల్‌టీ లైన్లను భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.

News October 28, 2025

తుంగతుర్తి: ‘టీకాలతోనే గాలికుంటు వ్యాధి నివారణ’

image

పశువులకు సమయానికి టీకాలు వేస్తే గాలికుంటు వ్యాధి నివారించవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం సంగెంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. 82 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, గోపాలమిత్రలు పాల్గొన్నారు.