News March 6, 2025
మంచిర్యాల: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త చిన్న వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.
News March 6, 2025
విజయనగరం: ‘లెక్కలు పరీక్షకు 999 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో 66 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కలు పరీక్షకు 999 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్ఐవోఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరీక్షకు 23,044 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22,045 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్ష ఏటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
News March 6, 2025
రాష్ట్ర సమస్యలపై గళమెత్తండి: ఎంపీలతో జగన్

AP: రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలని, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలని, దానిపై కేంద్రం స్పందించేలా చొరవ చూపాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారికి జగన్ దిశానిర్దేశం చేశారు.