News February 18, 2025
మండపేటలో బాలికపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం

పదో తరగతి బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మండపేటలో జరిగింది. ఈ ఘటనపై సీఐ సురేశ్ కథనం.. మండపేటోలని గొల్లపుంతకు చెందిన క్రాంతి కుమార్ (25) కు వివాహమైంది. అయితే పట్టణంలో చదువుతున్న పదో తరగతి బాలికను పరిచయం పెంచుకున్నాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది.
Similar News
News October 19, 2025
NLG: జిల్లాలో ఇక భూ సర్వేలు చకచకా!

ఇక భూ సర్వేలు చకచకా కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో సర్వేయర్ల కొరత తీరనుంది. ఇప్పటికే లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొలి విడత శిక్షణకు ఎంపికైన లిస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది.
News October 19, 2025
KNR: ‘పెద్దల సమక్షంలోనే క్రాకర్స్ పేల్చాలి’

దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సూచించారు. ప్రజలు సమగ్ర భద్రతా నియమాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు పేల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
లొద్ద అందాలను ‘క్లిక్’ మనిపించిన కలెక్టర్

సాలూరు మండలం గిరిశిఖర పంచాయతీ కొదమ పంచాయతీ లొద్ద అందాలను పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి స్వయంగా తన సెల్ ఫోన్లో బంధించారు. ఆదివారం ఉదయం లొద్ద ప్రాంతం చూడటానికి బయలుదేరారు. కలెక్టర్ వాహనం పైకి వెళ్లకపోవడంతో కమాండర్ జీపుతో లొద్ద జలపాతం వద్ద చేరుకున్నారు. ఈ క్రమంలో పకృతి అందాలను ఫొటోలు తీశారు.