News February 18, 2025

మండపేటలో బాలికపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం

image

పదో తరగతి బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మండపేటలో జరిగింది. ఈ ఘటనపై సీఐ సురేశ్ కథనం.. మండపేటోలని గొల్లపుంతకు చెందిన క్రాంతి కుమార్ (25) కు వివాహమైంది. అయితే పట్టణంలో చదువుతున్న పదో తరగతి బాలికను పరిచయం పెంచుకున్నాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది.

Similar News

News April 10, 2026

కాకినాడ: 13న జాబ్ మేళా..రూ.10-30 వేల వరకు వేతనం

image

కాకినాడ క‌లెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈనెల 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ లచ్చారవు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాకు 6 కంపెనీలు హాజరవుతాయని, టెన్త-పీజీ చదివిన వారు అర్హులన్నారు. 18-30 ఏళ్లున్న వారు అర్హులని, ఎంపికైన వారికి రూ10వేల- 30వేల వరకు వేతనాలు ఇస్తానని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు వికాస కార్యాలయంలో మేళాలో పాల్గొనాలన్నారు.

News April 10, 2026

KPHB: పోక్సో కేసులో వైద్యుడికి 7ఏళ్ల జైలు

image

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన డాక్టర్ కందుల సుబ్బారావు(76)కు కూకట్‌పల్లి పోక్సో కోర్టు 7ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో నమోదైన ఈ కేసులో నిందితుడికి శిక్షతో పాటు రూ.30,000 జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి ఎం.వెంకటేశ్వరరావు తీర్పు వెలువరించారు. కట్టుదిట్టమైన ఆధారాలతో కేసును నిరూపించిన కేపీహెచ్‌బీ పోలీసులను అధికారులు ప్రశంసించారు.

News April 10, 2026

రాయలసీమ అభివృద్ధికి జగన్ ఆటంకం: ఎంపీ

image

రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ రెడ్డేనని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 ప్రాజెక్టులను రద్దు చేసి, నేడు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.10,014 కోట్లు కేటాయించి, చరిత్ర సృష్టించిందన్నారు. 80శాతం ప్రాజెక్టులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నిర్మించినవని గుర్తుచేశారు.