News April 9, 2025
మండపేటలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మండపేట మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి కే కృష్ణవేణి మాట్లాడుతూ.. ఆఫ్కాస్ రద్దు చేసిన ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేసి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. మండపేట విస్తరణకు తగ్గట్లు కార్మికులను రిక్రూట్ చేయాలన్నారు.
Similar News
News April 24, 2025
నిర్మల్: తల్లిదండ్రులను కోల్పోయిన ఆగని లక్ష్యం

ఖానాపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల కళాశాల విద్యార్థిని తోకల ముత్తవ్వ అలియాస్ సుప్రియ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. BiPC ప్రథమ సంవత్సరంలో 429 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు లేకపోయినా పిన్ని, బాబాయిల సహకారంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివినట్లు తెలిపింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంది. సరూర్నగర్లోని COEలో సీటు సాధించడంతో ప్రస్తుతం నీట్ శిక్షణ పొందుతోంది.
News April 24, 2025
సంగారెడ్డి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు: ఐజీ

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిన్నారంలో 19న కొన్ని కోతులు గుట్టపై శివుని విగ్రహం కింద పడేయడంతో ధ్వంసమైనట్లు విచారణ తేలిందన్నారు. 22న గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు వెళ్తున్న మదార్సా విద్యార్థులను చూసి కొందరు ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
News April 24, 2025
ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

✒ 1929: ప్రముఖ నటుడు రాజ్కుమార్ జననం
✒ 1934: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
✒ 1969: జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
✒ 1973: మాజీ క్రికెటర్ సచిన్ జననం
✒ 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
✒ 2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం