News February 25, 2025

మండపేటలో స్కూల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని

image

తండ్రి మందలించాడని విద్యార్థిని స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మహమ్మద్ పజియా(14) ఖాళీ సమయంలో స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. పాల్పడింది. గాయాలైన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

Similar News

News December 8, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట: ఎస్పీ

image

అమలాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌కు సమస్యలపై 36 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు లిఖితపూర్వకంగా ఎస్పీకి సమస్యలు అందజేశారు. వాటిపై ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

News December 8, 2025

మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

image

* ఫ్రిజ్ కంపార్ట్‌మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్‌, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.

News December 8, 2025

బాపట్ల: అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అధికారులు పూర్తిస్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు అర్జీలను అందజేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.