News February 25, 2025
మండపేటలో స్కూల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని

తండ్రి మందలించాడని విద్యార్థిని స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మహమ్మద్ పజియా(14) ఖాళీ సమయంలో స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. పాల్పడింది. గాయాలైన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు.
Similar News
News March 24, 2025
క్రికెటర్ తమీమ్ ఇక్బాల్కు గుండెపోటు

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
News March 24, 2025
విశాఖ కలెక్టరేట్లో ఫిర్యాదుదారులకు స్నాక్స్

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతలు అందించేందుకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని ఫిర్యాదుదారులకు మజ్జిగ, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందిస్తున్నారు. వృద్ధులకు సైతం ఇబ్బందులు లేకుండా వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు.
News March 24, 2025
పెనుమంట్ర: 5 నెలల్లో ఐదుగురు మృత్యువాత

పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉన్న రహదారిపై ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతం ఇరుకుగా మారడంతో పాటు భారీ వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. నిత్యం ఈ దారిలో ఏదొక వాహన ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందంటున్నారు. రహదారి వెడల్పు చేస్తేనే కానీ ప్రమాదాలు తగ్గవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.