News March 12, 2025

మండపేట: బతుకు దెరువు కోసం వెళ్లి మృత్యువాత

image

బతుకు దెరువు కోసం మండపేట కొండపల్లి వారి వీధికి చెందిన జితేంద్ర(33) నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు జితేంద్రకు భార్య, 4నెలల కుమార్తె, తల్లి, సోదరుడు ఉన్నారు. జితేంద్ర కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. అయితే జితేంద్ర మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతదేహాం నిన్న రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. 

Similar News

News December 7, 2025

పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో వన్డే మ్యాచ్‌ విజయవంతం

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్‌కు నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ శంఖబ్రత భాగ్చి ఆధ్వర్యంలో స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని మోహరించి, డ్రోన్లతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన నియంత్రణతో భద్రతను విజయవంతంగా నిర్వహించారు.

News December 7, 2025

SKLM: నేడు ఎన్ఎంఎంఎన్ ఎగ్జామ్..పరీక్షా కేంద్రాలివే

image

విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ ప్రతిభా ఉపకార వేతనం(ఎన్ఎంఎంఎన్) ద్వారా స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. దీని కోసం NMMN ఎగ్జామ్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 8వతరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాగా..ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి నెల రూ.1000లను ఇస్తూ ఏడాదికి రూ.12వేలను అందిస్తుంది. నేడు పలాస, టెక్కలి, శ్రీకాకుళంలో ఉదయం 10-1 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.

News December 7, 2025

నల్గొండ: యాసంగికి నీటి విడుదల ఇలా..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్‌కు ఆన్, ఆఫ్ పద్ధతిలో సాగు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 80.74 టీఎంసీల విడుదల చేయనుండగా నల్గొండ చీఫ్ ఇంజినీర్ పరిధిలో 43.74 టీఎంసీలు, సూర్యాపేట ఇంజినీర్ పరిధిలో 40 టీఎంసీల అవసరం ఉంటుందని నిర్ధారించారు. 15 రోజులకోసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నారు. NLGలో 4,41,118, SRPTలో 4,74,041 ఎకరాలకు నీరు ఇవ్వనున్నారు.