News March 12, 2025

మండపేట: బతుకు దెరువు కోసం వెళ్లి మృత్యువాత

image

బతుకు దెరువు కోసం మండపేట కొండపల్లి వారి వీధికి చెందిన జితేంద్ర(33) నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు జితేంద్రకు భార్య, 4నెలల కుమార్తె, తల్లి, సోదరుడు ఉన్నారు. జితేంద్ర కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. అయితే జితేంద్ర మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతదేహాం నిన్న రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. 

Similar News

News December 16, 2025

డేంజర్‌లో హైదరాబాద్‌

image

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్‌, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.

News December 16, 2025

నేడు విజయవాడకు రానున్న YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భవానీపురం జ్యోతినగర్‌కు వచ్చి, ఇటీవల 42 ఫ్లాట్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన బాధితులతో మాట్లాడతారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు పూర్తిచేశాయి.

News December 16, 2025

గిరి ప్రదిక్షిణ చేసిన వారికి ఉచిత దర్శనం టోకెన్లు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఈరోజు గిరిప్రదక్షిణ చేసిన వారికి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. స్వామివారి నిజాభిషేకము అనంతరం గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు, సామాన్యులకు దర్శనం కల్పిస్తారు. టోకెన్లు అందజేయడంతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.