News February 1, 2025

మండపేట: భక్తి ముసుగులో రూ.40 కోట్లకు టోకరా

image

భక్తి ముసుగులో మహిళా భక్తులకు అధిక వడ్డీలు ఎర చూపి రూ.40 కోట్ల మేర ఓ వ్యక్తి మోసం చేసిన ఘటన మండపేటలో వెలుగులోకి వచ్చింది. మండపేటకు చెందిన ఓ వ్యక్తి పరిసర ప్రాంతాల్లో దేవుడు ముసుగులో కీర్తనలు, భజనలు నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీలు ఇస్తుండడంతో మహిళా భక్తులు అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. కొన్నాళ్లు సక్రమంగా ఇస్తూ అతడు ఆకస్మికంగా బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

Similar News

News December 3, 2025

సిద్దిపేట: సర్పంచ్ గిరి అస్సలే వద్దు..!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి పలువురు తాజా మాజీలు వెనుకంజ వేశారు. పల్లెపోరులో కొత్తవారే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 514 GPల పరిధిలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రెండు దశల్లోనూ తాజా మాజీ సర్పంచులు పోటీకి ఆసక్తి చూపట్లేరు. సర్పంచ్ గిరితో నష్టమే తప్ప లాభం లేదని, గతంలోని బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని, నిధులు రావని వారు భావిస్తున్నారు.

News December 3, 2025

తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

image

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్‌కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.

News December 3, 2025

మెదక్: సర్పంచ్ గిరి.. అన్నదమ్ముల సవాల్

image

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. గ్రామానికి చెందిన నెల్లూరు సిద్ధిరాములు, నెల్లూరి దాసు రక్తం పంచుకున్న అన్నదమ్ములు.. అది కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. సర్పంచ్ పదవిపై ఇద్దరికీ ఆశ కలిగింది. దీంతో పదవి కోసం ప్రత్యర్థులుగా మారి నిన్న జరిగిన చివరి రోజు నామినేషన్లలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.