News March 22, 2025

మండపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

మాచవరం- రామచంద్రపురం రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్‌పై వెళ్తుండగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఇద్దరు కిందపడ్డారు. బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 27, 2025

జనగామ: నేడు మొదటి విడత జీపీ ఎన్నికల నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లను ఈరోజు ఉ.10 నుంచి సా.5 గం.ల వరకు అధికారులు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జనగామ జిల్లాలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, జఫర్గడ్ మండలంలోని 110 గ్రామపంచాయతీలు, 1024 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

News November 27, 2025

రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

image

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.

News November 27, 2025

జనగామ: మొదలైన సర్పంచ్ ఎన్నికల సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జనగామ జిల్లాలోని ఆయా పార్టీల వారు ఎన్నికల సమరం మొదలుపెట్టారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియలో పడ్డారు. నిన్నటి నుంచి మొదలైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు రెండు, మూడు రోజుల్లో క్లియర్ అయ్యే వాతావరణం గ్రామాల్లో కనిపిస్తుంది. కాగా, రిజర్వేషన్ తారుమారు అవడంతో పార్టీ నేతలకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది.