News March 22, 2025
మండపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మాచవరం- రామచంద్రపురం రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్పై వెళ్తుండగా సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఇద్దరు కిందపడ్డారు. బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.
News December 1, 2025
ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
News December 1, 2025
మహబూబాబాద్ డీఈఓగా రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా పనిచేసిన దక్షిణామూర్తి వీఆర్ఎస్ తీసుకోవడంతో, విద్యాశాఖ ఏడీగా ఉన్న రాజేశ్వర్ను డీఈఓగా నియమించారు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది, పలువురు నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్రావుకు అభినందనలు తెలిపారు.


