News January 28, 2025
మండవల్లి: బాలుడుతో సహా నలుగురు మృతి

మండవల్లి మండలం భైరవపట్నంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడు ఆదివారమే ప్రాణాలు విడవగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఈనెల 24న రాత్రి భైరవపట్నంలో గ్యాస్ సిలిండర్లు పేలి తొమ్మిది గుడిసెలు దగ్ధమైన విషయం తెలిసిందే. తమిళనాడులోని వేలూరులో చికిత్స పొందుతూ డబ్బా పాప(అను)(20), దుబ్బా విక్కి(3), నక్కల కార్తీక్ (19), నక్కల చరణ్ (17)లు మంగళవారం మృతి చెందారు.
Similar News
News November 28, 2025
వాషింగ్ మెషీన్.. ఈ జాగ్రత్తలు తెలుసా?

నిన్న HYDలో వాషింగ్ మెషీన్ <<18404735>>పేలడంతో<<>> చాలా మంది భయపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. *రెగ్యులర్గా ఫిల్టర్ క్లీన్ చేసుకోవడంతో పాటు సర్వీసింగ్ చేయించాలి *టూల్స్ మార్చాల్సి వస్తే బ్రాండెడ్వే వాడాలి *ఎక్కువ లోడ్ (దుస్తులు) వేయొద్దు. దీన్ని వల్ల ఒత్తిడి పెరుగుతుంది *ఏదైనా పెద్ద శబ్దం, వాసన వస్తే వెంటనే ప్లగ్ తీసి టెక్నీషియన్ను పిలవాలి.
News November 28, 2025
వరంగల్ కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారాలపై ఆరోపణలు రావడంతో <<18416226>>CM ఆగ్రహం <<>>వ్యక్తం చేయగా వీసీ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో డబ్బులు తీసుకొని రీకౌంటింగ్లో నలుగురికి <<18401167>>మార్కులు కలిపారని<<>> విజిలెన్సు విచారణలో ప్రాథమికంగా తేలింది. నోటిఫికేషన్లు లేకుండా సిబ్బంది నియామకం అంశం, BRSనేత హరీశ్ రావు గవర్నర్కు ఫిర్యాదుచేయడంతో ప్రభుత్వానికి మరక అంటొద్దనే ఉద్దేశంతో రాజీనామాచేసినట్టు తెలుస్తోంది.
News November 28, 2025
HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తనే దారుణ హత్య చేసిందో భార్య. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేంద్ర నగర్లో నివసించే బండారి అంజయ్య(55) స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడేవాడు. గురువారం రాత్రి వివాదం జరగడంతో కుమారుడు, మరొకరితో కలిసి భార్య అతడిని చంపేసింది. కేసు నమోదైంది.


