News April 6, 2025
మంత్రిఅచ్చెన్నకు కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ కాంట్రాక్ట్ ఉద్యోగులు శనివారం రాత్రి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సమగ్ర శిక్ష అభియాన్లో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కేవలం రూ. 17 వేలను మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు గౌరవ వేతనం చాలడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

ఆమదాలవలస: అభివృద్ధికి విద్యుత్ రంగం కీలకం: ఎమ్మెల్యే కూన
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 37 అర్జీలు
కలెక్టర్ గ్రీవెన్స్కు ఫిర్యాదుదారుల తాకిడి
బాల్య వివాహాలను అరికట్టాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే మామిడి
నందిగం: జాతీయ రహదారిపై తప్పిన పెనుప్రమాదం
పోలాకి: విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు.
News December 22, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 37 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఏఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం
శ్రీకాకుళంలోని జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. మొత్తం 37 అర్జీలు స్వీకరించామన్నారు.
News December 22, 2025
శ్రీకాకుళం: పోలియో సిరా చుక్క..ఎందుకంటే?

శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం 93% పూర్తయినట్లు వైద్యాధికారులు నేడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 0-5 ఏళ్లున్న చిన్నారులకు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేసినంతరం ఎడమచేతి చిటికెల వేలుకు చుక్క పెడతారు. దీనికి కారణమేంటంటే..మరొక కేంద్రానికి వెళ్లకుండా, పోలియో చుక్కలు దుర్వినియోగం కాకుండా ఈ విధానం కొనసాగిస్తున్నారు. గతంలో సిరా పెట్టేవారు. ప్రస్తుతం పర్మినెంట్ మార్కర్ పెన్ వాడుతున్నారు.


