News July 5, 2024
మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన ఎమ్మెల్యే ఉగ్ర

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గం అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఉగ్ర తెలిపారు.
Similar News
News December 12, 2025
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రూ.10 కోట్లతో పనులు

ఒంగోలు రిమ్స్ వైద్యశాల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 12, 2025
ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 12, 2025
ప్రకాశం జిల్లా TDP అధ్యక్ష పదవి.. ఛాన్స్ ఉగ్రాకేనా?

ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇంకా భర్తీ కాని విషయం తెలిసిందే. కొన్ని నెలలక్రితం ఇక అధ్యక్ష పదవి భర్తీ అవుతుందని క్యాడర్ భావించినా TDP అధిష్ఠానం మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చినా, అధిష్ఠానం రాజకీయ సమీకరణాల ప్రకారం నిర్ణయం తీసుకోనుందట. తాజాగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డి పేరు అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీ కామెంట్.


