News March 15, 2025
మంత్రి ఉత్తమ్తో తుమ్మల భేటీ..!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై సమావేశమయ్యారు. తుమ్మల మాట్లాడుతూ.. భూసేకరణను వేగవంతం చేయాలని భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సత్తుపల్లి ట్రంక్ పనులు, 4వ పంపు హౌస్ నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని సూచించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, సమయపాలనపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.
Similar News
News February 12, 2026
డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది డుమ్మా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ములుగు(మం) రాంచంద్రాపురం, పందికుంట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాంచంద్రపురం సబ్ సెంటర్ లో సిబ్బంది ఎవ్వరూ విధుల్లో లేరు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మెమోలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సమయపాలన పాటించకున్నా, ప్రజలకు అందుబాటులో లేకున్నా చర్యలు తప్పవన్నారు. తర్వాత పందికుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
News February 12, 2026
మంచిర్యాల: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూములను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
News February 12, 2026
ADB: ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చూసుకోవాలి: SP

ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో దొంగతనాలు జరగకుండా ఉంటాయన్నారు. ఒక వేళ జరిగినప్పుడు వాటిని చేధించడంలో ఉపయోగపడతాయన్నారు. పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తుందన్నారు.


