News February 14, 2025
మంత్రి గన్మెన్ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ

రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్మెన్గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 7, 2025
సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 7, 2025
గచ్చిబౌలి: ఫుడ్ ప్రాసెసింగ్పై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్

గచ్చిబౌలి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్ జరిగింది. చైనా, రష్యా సహా ఇతర దేశాలకు చెందిన పలువురు నిపుణులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై పెట్టుబడులు లాభసాటిగా ఉన్నాయని, రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నట్లుగా FPUD డైరెక్టర్ సింగనాద్ జూరీ తెలిపారు.
News November 7, 2025
వనపర్తి: ‘బీజీలు సమర్పించిన మిల్లులకే ధాన్యం కేటాయింపు’

ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు (బీజీ) సమర్పించిన రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. అర్హత సాధించిన 80 మిల్లుల్లో కేవలం 18 మిల్లులు మాత్రమే బీజీలు సమర్పించాయని, మిగతా అర్హతగల మిల్లులన్నీ వెంటనే బీజీలు సమర్పించాలని ఆదేశించారు.


