News June 13, 2024
మంత్రి నారాయణను కలిసిన మాజీ మంత్రి పరసా

నూతన రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరసా రత్నం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు
Similar News
News March 25, 2025
నెల్లూరులో జాడే లేని అనిల్ కుమార్ యాదవ్.?

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి దూకుడు పెంచారు. వరుసగా కార్యకర్తలు, నేతలను కలుస్తూ వారికి అండగా ఉంటున్నారు. MLC చంద్రశేఖర్ రెడ్డి సైతం అటు శాసనమండలి, ఇటు బహిరంగంగా టీడీపీ నేతలను ఎండగడుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వంటి నేతలు మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News March 25, 2025
అక్రమ కేసులకు భయపడం: కాకాణి

టీడీపీ నేతల దురాగతాలకు తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్న ఆయన.. YCP కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్పై ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు తాము భయపడమని, తాము తిరగబడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
News March 25, 2025
నెల్లూరు: నిన్నే వివాహం చేసుకుంటానని చెప్పి.!

వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ టీచర్ వద్ద మహిళ భారీగా సొమ్ము దోచేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. నంద్యాలకు చెందిన కౌలస్య తనను వివాహం చేసుకుంటానని రూ.4.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని వేదాయపాళెంకు చెందిన ఓ టీచర్ వాపోయాడు. ఈ మేరకు ఆయన సోమవారం నెల్లూరులో జరిగిన SP గ్రీవెన్స్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు.