News March 9, 2025
మంత్రి నారా లోకేశ్ కదిరి పర్యటన వివరాలు

మంత్రి నారా లోకేశ్ కదిరి పర్యటన వివరాలను ఆయన కార్యాలయం విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4:20 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కదిరికి సాయంత్రం 6:15 గంటలకు వస్తారు. 9 గంటలకు నరసింహ స్వామికి వస్త్రాలు సమర్పించి, తిరిగి వెళ్తారు.
Similar News
News April 10, 2026
నల్గొండ: ఆ 1,483 స్కూల్స్ బాగుపడితే తిరుగుండదు

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ZPHS.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మంత్రి కోమటిరెడ్డి సొంతంగ రూ.8 కోట్లతో ఈ బడిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడంతో, వచ్చే ఏడాది ప్రవేశాలకు అప్పుడే వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అడ్మిషన్లు క్లోజ్ చేశారు. అయితే, జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,483 ప్రభుత్వ పాఠశాలలను కూడా డెవలప్ చేస్తే పేరెంట్స్ ప్రైవేట్ వైపు వెళ్లరు కదా అనే చర్చ మొదలైంది.
News April 10, 2026
రామాయంపేట: సైకిల్ పై నుంచి కిందపడి రైతు మృతి

సైకిల్ పై నుంచి కిందపడి రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు మల్లయ్య అనే రైతు తన పొలానికి వెళ్లి వస్తుండగా సైకిల్కు కుక్క అడ్డు రావడంతో కిందపడి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 10, 2026
భద్రాద్రి: తీవ్రంగా ఆయుష్ వైద్యుల కొరత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుర్వేద (ఆయుష్) వైద్యుల కొరత రోగులను వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అతి తక్కువ మంది వైద్యులు అందుబాటులో ఉండటంతో హోమియోపతి, ఆయుర్వేద సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ప్రభుత్వం స్పందించి అదనపు వైద్యులను నియమించాలని, తద్వారా సామాన్యులకు ప్రత్యామ్నాయ వైద్య సేవలను చేరువ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. # ప్రపంచ హోమియోపతి దినోత్సవం.


