News April 16, 2025

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ADB కలెక్టర్

image

భోరజ్ మండలం పూసాయిలో ఏర్పాటు చేయనున్న భూ భారతి రెవెన్యు సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్న సందర్భంగా బుధవారం మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. మంత్రితో ప్రారంభించే భూ భారతి పోర్టల్ సదస్సుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, తహశీల్దార్ రాజేశ్వరి ఉన్నారు.

Similar News

News April 20, 2025

సిరిసిల్ల :సోమవారం ప్రజావాణి రద్దు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 21 సోమవారం హై కోర్టు కేసు విషయంలో వ్యక్తిగతముగా హాజరవుతున్న కారణంగా అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News April 20, 2025

మగవాళ్లకూ ‘హీ’ టీమ్స్ ఉండాలి: పురుషులు

image

మహిళలకు ‘షిీ’ టీమ్స్‌లాగే పురుషులకు కూడా ‘హీ’ టీమ్స్ ఉండాలని భార్యాబాధితులు డిమాండ్ చేశారు. భార్యల చిత్రహింసల నుంచి తమను కాపాడాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల భార్యాబాధితులు ఢిల్లీలోని ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువమంది బాధితులు పాల్గొన్నారు. వీరంతా ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ పేరుతో ఆందోళన చేపట్టారు. తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా కూడా ఇందులో పాల్గొనడం విశేషం.

News April 20, 2025

DSC: కర్నూలు జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

image

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. కర్నూలు జిల్లాలో 209 ఎస్ఏ పీఈటీ, 1,817 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 2,645 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 10 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో మొత్తం 33 పోస్టులు ఉన్నాయి.

error: Content is protected !!