News September 10, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు

image

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. నగరంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందని, బాధ్యత గల మంత్రిగా కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి పొన్నం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. నగరంలో 3 నెలల క్రితం తమకు సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కరీంనగర్లో సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

Similar News

News October 23, 2025

గన్నేరువరం PSను ఆకస్మిక తనిఖీ చేసిన CP

image

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గన్నేరువరం పోలీస్ స్టేషన్‌ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, ఆవరణలోని సీజ్డ్ వాహనాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించి సీసీటీఎన్ఎస్ 2.0, ఈ- సమన్లు, టీఎస్- కాప్, ఈ- సాక్ష్య తదితర సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై పూర్తి పట్టు సాధించి వాటిని విధుల్లో విరివిగా వినియోగించాలని సూచించారు. FIR ఇండెక్స్‌, పెండింగ్ కేసులపై సమీక్షించి వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.

News October 23, 2025

ముగిసిన నామినేషన్ల పర్వం.. NOV 1న పోలింగ్

image

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈరోజు వరకు మొత్తం 73 నామినేషన్లు దాఖలయ్యాయని, రేపు పరిశీలన జరగనుందని, 25న ఉపసంహరణ జరగనుందని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. నవంబర్ 1న కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల & జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ జరగనుందని, ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

News October 23, 2025

డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్

image

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను తెలియపరిచేందుకు రంగోలీ పోటీలు నిర్వహించారు.