News September 10, 2024
మంత్రి పొన్నం ప్రభాకర్పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు

మంత్రి పొన్నం ప్రభాకర్పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. నగరంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందని, బాధ్యత గల మంత్రిగా కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి పొన్నం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. నగరంలో 3 నెలల క్రితం తమకు సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కరీంనగర్లో సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.
Similar News
News February 14, 2026
JMKT: ఒకరికి సున్నా.. ఆరుగురికి ఒక్కటే ఓటు!

జమ్మికుంట మున్సిపాలిటీలో కొందరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూస్తుంటే.. కనీసం వారి ఇంట్లోని వారు కూడా వారికి ఓటు వేయలేదా? అన్న సందేహం కలుగుతోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థికి సున్నా ఓట్లు వచ్చాయి. అంటే ఆమెకు సొంత ఓటు కూడా పడకపోవడం గమనార్హం. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు జనసేన అభ్యర్థులకు ఒకే ఒక ఓటు రావడం స్థానికంగా చర్చకు దారితీసింది.
News February 14, 2026
కరీంనగర్ యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం

కరీంనగర్ నగరంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక గదిలో మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న ఫర్నిచర్, రూఫ్ కప్పు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కరీంనగర్, మానకొండూరు నుంచి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
News February 14, 2026
హుస్నాబాద్: పద్మ, సుప్రజ మూడోసారి..

హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మ 50 ఓట్ల మెజార్టీతో, 18వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వాల సుప్రజ 302 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో వరుసగా వీరు మూడోసారి కౌన్సిలర్లుగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులే మళ్లీ గెలిపించాయని వారు పేర్కొన్నారు.


