News March 21, 2025

మంత్రి ఫరూక్ సతీమణి మృతిపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి

image

న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ‘మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ ప‌విత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారు. ఆమెకు జ‌న్న‌త్‌లో ఉన్న‌త‌మైన స్థానం ప్రసాదించాల‌ని, ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ‌ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నా’ అని ‘X’లో ట్వీట్ చేశారు.

Similar News

News October 20, 2025

సౌతాఫ్రికాతో టెస్టు.. రూ.60కే టికెట్

image

క్రికెట్ అంటే భారత్‌లో ఓ ఎమోషన్. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. T20ల ప్రభావమో, ఏమో టెస్టులకు ఆదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌కు ప్రేక్షకుల స్పందన చూస్తే అదే అనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కోల్‌కతా వేదికగా (Nov 14-18) సౌతాఫ్రికాతో భారత్ తలపడే తొలి టెస్టుకు టికెట్ ప్రారంభ ధర రోజుకు రూ.60గా నిర్ణయించారు. ఇవాళ మ.12 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.

News October 20, 2025

నేడు పత్తికొండ టామాటా మార్కెట్ బంద్

image

కర్నూలు జిల్లా పత్తికొండలోని టమాటా మార్కెట్‌కు నేడు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని క్రయ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యార్డు కార్యదర్శి కార్నోలీస్ తెలిపారు. రేపటి నుంచి టమాటా కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 20, 2025

వీరికి వారం ముందు నుంచే ‘దీపావళి’

image

మనం దీపావళి ఏ రోజైతే ఆరోజే వేడుకలు చేసుకుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్​లోని సెమ్రా గ్రామంలో దీపావళి వేడుకలు వారం ముందు నుంచే మొదలవుతాయి. ఈ ఆచారం వెనుక ఓ కారణం ఉంది. పూర్వం సింహం దాడిలో మరణించిన సర్దార్ దేవ్, గ్రామ పూజారి కలలోకి వచ్చి దీపావళి పండుగను ముందే జరపాలని చెప్పాడట. అలా చేయకపోతే దురదృష్టం కలుగుతుందని హెచ్చరించాడట. అప్పటి నుంచి అక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఊర్లో OCT 20నే దీపావళి మొదలైంది.