News March 21, 2025
మంత్రి ఫరూక్ సతీమణి మృతికి సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. షహనాజ్ మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. కాగా, కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్లోని వారి నివాసంలో మృతిచెందారు.
Similar News
News October 15, 2025
నిర్మల్: మద్యం షాపులకు 42 దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం 42 దరఖాస్తులు వచ్చాయని డీపీఈవో అబ్దుల్ రజాక్ తెలిపారు. గత పాలసీలో 701 దరఖాస్తులు వచ్చాయని, ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తులు దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 18 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
News October 15, 2025
పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్’ స్టాక్మార్కెట్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
News October 15, 2025
సూర్యాపేట: ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి: ఎస్పీ

ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసు ప్రజా భరోసాలో భాగంగా అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రావీణ్యం ఉన్న అంశాలపై సాధన చేయాలని, చెడు అలవాట్లకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల కష్టం చాలా విలువైనదన్నారు. అనంతరం డ్రగ్స్, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.