News September 18, 2024
మంత్రి లోకేష్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గన్ని

ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మంత్రి నారా లోకేష్ను ఉండవల్లిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి చర్చించారు. ఆయన వెంట పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శ్రీనివాసులు, నాయకులు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
News October 23, 2025
ప్రజా సమస్యలను పరిష్కరించండి: కలెక్టర్

కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై గురువారం వివిధ శాఖల జిల్లా అధికారంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోపుగా జిల్లా అధికారుల స్వీయగా పర్యవేక్షణలో పరిష్కరించాలన్నారు. లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
News October 23, 2025
ఉండి: మేడవరం వద్ద స్కూల్ బస్సు బోల్తా

ఉండి మండలం పెదపుల్లేరు శివారు మేడవరం వద్ద గురువారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వారిని తక్షణమే బయటకు తీసి, చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.