News March 29, 2024

మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక పదవి

image

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఏఐసిసి అధిష్టానం మరో కీలక పదవిని అప్పజెప్పింది. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రామగుండం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ అనుబంధ పార్టీ సెక్రటరీ జనక్ ప్రసాద్‌కు సభ్యుడుగా నియమిస్తే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 5, 2025

ఎన్నికల భద్రతపై సమీక్షించిన సీపీ

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 104 రూట్లు, 57 క్లస్టర్లను ఏర్పాటు, 508 మళ్లీ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 4, 2025

కరీంనగర్‌: మూడు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్‌గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.

News December 4, 2025

కరీంనగర్‌ జిల్లాలో 276 వార్డు సభ్యులు ఏకగ్రీవం

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని మొత్తం 866 వార్డులకు గాను, 276 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 590 వార్డులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.