News August 11, 2024

మంత్రి సంధ్యారాణికి అంగన్వాడీల వినతి

image

ఫేస్ యాప్ ద్వారా లబ్ధిదారులను నమోదు చేసి, వారి ఫోన్‌లకు ఓటీపీ వచ్చిన తర్వాతే సరుకులు ఇచ్చేలా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్టుగా విజయనగరం, గంట్యాడలను ఎంపిక చేశారన్నారు. దీంతో పని భారం పెరుగుతుందన్నారు.

Similar News

News November 24, 2025

ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి: AC

image

TTD శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ విజయనగరం జిల్లా AC శిరీష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, యజమాని NOCను జతచేసి, దరఖాస్తులను తోటపాలెంలో ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయానికి అందజేయాలన్నారు.

News November 24, 2025

అత్యాచారం కేసులో వ్యక్తికి 12 ఏళ్ల జైలు: SP

image

2019లో గరివిడిలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన బొండపల్లికి చెందిన సవిరిగాన సూర్యనారాయణకు విజయనగరం మహిళా కోర్టు 12 ఏళ్ల కఠిన కారాగార, శిక్ష రూ.2వేల జరిమానా విధించిందని ఎస్పీ దామోదర్ ఇవాళ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. PP సత్యం వాదనలతో నిందితుడిపై నేరం రుజువైందన్నారు. దర్యాప్తు చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.

News November 24, 2025

రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థ‌లాన్ని ప‌రిశీలించారు.