News August 11, 2024
మంత్రి సంధ్యారాణికి అంగన్వాడీల వినతి

ఫేస్ యాప్ ద్వారా లబ్ధిదారులను నమోదు చేసి, వారి ఫోన్లకు ఓటీపీ వచ్చిన తర్వాతే సరుకులు ఇచ్చేలా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్టుగా విజయనగరం, గంట్యాడలను ఎంపిక చేశారన్నారు. దీంతో పని భారం పెరుగుతుందన్నారు.
Similar News
News October 14, 2025
విజయనగరం: విధుల్లోకి చేరిన నూతన ఉపాధ్యాయులు

డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు విధుల్లో చేరడంతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ఈ నియామకాలతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీతో జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్మెంట్లో 578 మంది కొత్త ఉపాధ్యాయలు పోస్టింగ్ పొందారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. వీరంతా సోమవారం విధులకు హాజరయ్యారు.
News October 14, 2025
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
News October 13, 2025
VZM: ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న కౌన్సిలింగ్

ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలలో 91 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 16న ఉ.11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ దేవి మాధవి సోమవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ జాబితాలు http://vizianagaram.nic.in, అందుబాటులో ఉన్నాయన్నారు.