News February 7, 2025

మంత్రి సంధ్యారాణికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

image

మొదటిసారి MLAగా గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి చంద్రబాబు క్యాబినేట్‌లో మహిళా& శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20 ర్యాంక్ ఇవ్వగా.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి 3వ ర్యాంక్ సాధించారు. మరి సంధ్యారాణి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?

Similar News

News November 6, 2025

నిర్మల్: త్వరలో ఈ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ సేవలు

image

నిర్మల్ డిపో నుంచి వివిధ దేవాలయాల యాత్రలకు త్వరలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ పండరి తెలిపారు. పండరి పూర్, తుల్జాపూర్, కొలహాపూర్, భద్రాచలం, సింహచలం, అన్నవరం రామేశ్వరం, శ్రీరంగం, కంచీపురం, అరుణాచలం, శబరిమలై నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆధారించాలని ఆయన కోరారు.

News November 6, 2025

మ్యాగజైన్ ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

image

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం కలెక్టరేట్‌లో మెడి వాయిసెస్ వైద్య రంగ మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య రంగంలో అవగాహన పెంచే ప్రయత్నాలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్, మెడి వాయిసెస్ మ్యాగజైన్ కో-ఫౌండర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

News November 6, 2025

పెద్దపల్లి: భవన నిర్మాణ కార్మికులకు మరణ సహాయం పెంపు: హేమలత

image

భవన నిర్మాణ రంగ కార్మికులకు మరణ ఉపశమన సహాయం పెంచినట్లు పెద్దపల్లి సహాయ కార్మిక అధికారిణి హేమలత తెలిపారు. ప్రమాద మరణ సహాయం రూ.10లక్షలకు, సాధారణ మరణ సహాయం రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం బీమా నియంత్రణ సంస్థ మార్గదర్శకాల మేరకు అమలవుతుందని తెలిపారు. వివాహ, ప్రసూతి ప్రయోజనాల కోసం “మీ సేవ” ద్వారా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.