News April 11, 2024
మంత్రి సీతక్క కాన్వాయ్ని తనిఖీ చేసిన పోలీసులు

మంత్రి సీతక్క కాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్లంపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గూడ మండలంలో నేడు మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని ములుగుకు వస్తుండగా ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, వారికి మంత్రి సహకరించారు.
Similar News
News March 27, 2025
WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
వరంగల్: డ్రగ్స్ వేర్ హౌస్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

వరంగల్ పట్టణంలో రంగశాయిపేట యూపీహెచ్సి ప్రాంగణంలో సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. అధికారులపై సిబ్బంది ఔషధాల స్టాక్, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించి, విధులకు గైరుహజరైన సూపర్వైజర్కు షో కాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 27, 2025
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి మంగళవారం రూ.10,800 ధర పలకగా.. నేడు రూ.10,500 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.28,000 ధర వచ్చింది. సింగిల్ పట్టికి నిన్న రూ.27వేలు రాగా నేడు రూ.29వేల ధర పలికింది. దీపిక మిర్చి నిన్న రూ.13,300 ధర రాగా నేడు రూ. 13వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.