News June 13, 2024

మంత్రి స్థానం నిలబెట్టుకున్న ‘సాలూరు’ నియోజకవర్గం

image

సాలూరు నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెలేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె సమీప ప్రత్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక. రాజన్నదొరపై 13,733 ఒట్ల మోజారిటీతో గెలుపొందారు. లోకేశ్ యువగళం కార్యక్రమంలో సాలూరులో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆమె గెలుపుతో ‘సాలూరు’ నియోజకవర్గం మంత్రి స్థానం నిలబెట్టుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Similar News

News October 2, 2024

విజయనగరం ఉత్సవాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష

image

జిల్లాలో ఈనెల 13న నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పైడిమాంబ తొలేళ్ళు, సిరిమానోత్సవంకు చేపట్టే భద్రత, బందోబస్తు ఏర్పాట్లుపై ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. శాంతియుతంగా నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News October 2, 2024

VZM: 2019కి ముందు ఎన్ని మద్యం షాపులు ఉండేవి అంటే..?

image

వైసీపీ ప్రభుత్వం రాక ముందు టీడీపీ ప్రభుత్వంలో చివరిగా 2017 జూలైలో ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. అప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 210 షాపులకు టెండర్లు పిలవగా 3,636 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా అప్లికేషను ఫీజు కింద ప్రభుత్వానికి రూ. 21 కోట్లు ఆదాయం వచ్చింది. అప్లికేషను ఫీజు కింద జనాభాను బట్టి రూ. 55 వేలు నుంచి 75 వేల వరకు నిర్ణయించారు. తాజాగా జిల్లాలో 153 షాపులకు టెండర్లు పిలిచారు.

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.