News February 25, 2026

మంత్ర పఠనం వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు

image

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మంత్ర పఠనం ఓ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంత్రాలను క్రమం తప్పకుండా పఠిస్తే మన చుట్టూ ‘మంత్ర కవచం’ అనే రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుంది. ఏకాగ్రత పెంచి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. భగవంతునితో అనుసంధానం కావడానికి, ఆత్మశాంతిని పొందడానికి మంత్ర పఠనం ఓ సులభమైన మార్గం.

Similar News

News April 14, 2026

మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.

News April 14, 2026

మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.

News April 14, 2026

శివునికి ఏ అభిషేకంతో ఏ ఫలితం వస్తుంది?

image

శివాభిషేకంలో వాడే ప్రతి వస్తువు ఓ ప్రత్యేక ఫలితాన్నిస్తుందని నమ్మకం. ఆవు పాలతో సౌఖ్యాలు, పెరుగుతో బలం, నెయ్యితో ఐశ్వర్యం, కొబ్బరి నీటితో సంపద, చెరకు రసంతో ధనవృద్ధి కలుగుతుందట. నీటితో పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయట. ద్రాక్ష రసంతో విజయం, పసుపు నీటితో శుభాలు, తేనెతో తేజోవృద్ది, అన్నంతో దీర్ఘాయువు, భస్మంతో పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏ అభిషేకం చేసినా, ఫలితం దక్కాలంటే మనలో నిష్కల్మషమైన భక్తి ఉండాలి.