News February 14, 2026

మంథని: ఒకరికి ఒకటి.. ఇద్దరికీ రెండు ఓట్లు

image

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. కానీ, అభ్యర్థులు ఒకటి.. రెండు ఓట్లు మాత్రమే సాధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మంథని మున్సిపాలిటీలో పోటీచేసిన ఆరుగురు అభ్యర్థులు (స్వతంత్రులు) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇందులో ఒకటో వార్డులో పోటీ చేసిన కిన్నెర వెన్నెల ఒక్క ఓటు మాత్రమే సాధించింది. అలాగే 11వ వార్డులో డీకొండ రవికిరణ్ కు రెండు ఓట్లు, జక్కం రంజిత్ కుమార్ రెండు ఓట్లు సాధించారు.

Similar News

News March 11, 2026

ఏలూరు: రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగే అవకాశం!

image

ఏలూరు కార్పొరేషన్ పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఏసీబీ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కీలక రికార్డులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు ఎలా ఇస్తున్నారు అనే అంశంపై, ఇటీవల బదిలీ అయినప్పటికీ కొందరు అధికారులు పలుకుబడిని ఉపయోగించి తిరిగి ఏలూరులోనే కొనసాగడంపై అధికారులు ఆరా తీశారు. దాడులు బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

News March 11, 2026

గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్‌.. విచారణకు ఆదేశం

image

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.

News March 11, 2026

MBNR: లిఫ్ట్ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం

image

ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల వివరాలు.. పట్టణానికి చెందిన ఓ మహిళ రాత్రి రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పైఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకుని మున్సిపాలిటీని దాటగానే బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా PSకు చేరుకొని ఫిర్యాదు చేసింది.