News February 10, 2025
మంథని: కోడలిపై మామ లైంగిక వేధింపులు..?

అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.
Similar News
News March 22, 2025
NRPT: జలం ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు..!

నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ నీటి దినోత్సవ సందర్భంగా వినూత్నంగా జల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జలవనులను ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు.. అంటూ చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి? నీటిని వృథా చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీచర్స్ పాల్గొన్నారు.
News March 22, 2025
రేపు, ఎల్లుండి వర్షాలు

TG: నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు రాత్రి వరకు కొన్ని చోట్ల వాన పడుతుందని పేర్కొంది.
News March 22, 2025
జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.