News April 13, 2025

మంథని: చెడగొట్టు వాన.. అన్నదాత గుండె పగిలే

image

మంథని మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోతల దశలో ఉన్న వరి పంటలు వర్షానికి దెబ్బతింటుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కల్లాలలో పోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతుండటంతో చేతికి వచ్చే ఆశలు కూడా లేవని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 11, 2025

ఏపీ వారికీ నేను మామనే: శివరాజ్‌సింగ్

image

AP: మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చెప్పారు. వాటర్‌షెడ్ పథకం కింద గుంటూరు(D) వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ‘దీనిద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు పశువులకు తాగునీరు లభిస్తుంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చెరువులను అభివృద్ధి చేస్తాం. మధ్యప్రదేశ్ ప్రజలు నన్ను మామ అంటారు. ఇకపై AP వారికీ మామనే’ అని వ్యాఖ్యానించారు.

News November 11, 2025

NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నవంబర్, డిసెంబర్ మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.

News November 11, 2025

సీఎం స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను: రామ్మోహన్‌రావు

image

నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పెట్టుబడిదారుడిగా ఎదిగానని పారిశ్రామికవేత్త రామ్మోహన్‌రావు తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన CMతో వర్చువల్‌గా మాట్లాడారు. 2017 CIIసదస్సులో CM సమక్షంలో MOU కుదిరిందని, అప్పటి నుంచి చంద్రబాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 5 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.