News February 16, 2025
మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన తోట రాయమల్లును ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కాలు విరిగ్గా భయానకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
జనగామ: అదనపు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు!

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పింకేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి మంగళవారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు ఆయనకు పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈయన అదనపు కలెక్టర్ బాధ్యతలతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండేళ్లలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.
News December 16, 2025
జమ్మూకశ్మీర్ ప్లేయర్కు ఊహించని ధర

జమ్మూకశ్మీర్ ప్లేయర్ ఆకిబ్ నబి దార్కు ఊహించని ధర లభించింది. ఐపీఎల్ వేలంలో రూ.8.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 29 ఏళ్ల ఈ బౌలర్ కోసం సన్ రైజర్స్, ఢిల్లీ పోటీ పడ్డాయి. రూ.30 లక్షల బేస్ ప్రైస్తో ఆకిబ్ ఆక్షన్లోకి రావడం గమనార్హం. SMAT 2025-26లో 7 మ్యాచ్లలో 15 వికెట్లు తీసుకున్నారు.
News December 16, 2025
జపమాలలో 108 పూసలు ఎందుకు?

జపమాలలో ఓ గురు పూసతో పాటు 108 ప్రార్థన పూసలు ఉంటాయి. అందులో 108 పూసలు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను సూచిస్తాయి. భక్తులు ఆ మొత్తం పూసలను లెక్కించడాన్ని ఓ వృత్తం పూర్తైనట్లుగా భావిస్తారు. అలాగే ఇవి పుట్టుక, జీవితం, మరణం.. అనే మన జీవిత చక్రాన్ని చిత్రీకరిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా జపమాల సాధన చేసిన వారికి ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందని, త్వరగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు.


