News March 7, 2025
మంథని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. బైక్పై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందా మరొకరికి గాయాలయ్యాయి. మృతిని పేరు ఉదయ్గా గుర్తించారు. గాయాలైన వ్యక్తిని అంబులెన్స్లో మంథని హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్ (గచ్చిబౌలి) నుంచి రెండు బైక్లపై నలుగురు యువకులు ఖమ్మంపల్లిలో స్నేహితుని వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Similar News
News March 9, 2025
కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధుల మంజూరు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
News March 9, 2025
కరీంనగర్: సీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం

కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్గా గౌస్ ఆలం ఆదివారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్గా వచ్చారు.
News March 9, 2025
ALERT: KNR జిల్లాలో 40°C చేరిన ఉష్ణోగ్రతలు

KNR జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో మల్యాలలో 40.5°C నమోదు కాగా, జమ్మికుంట 40.0, గుండి 39.7, కొత్తపల్లి-ధర్మారం, ఈదులగట్టేపల్లి 39.1, నుస్తులాపూర్ 38.8, బురుగుపల్లి 38.3, ఖాసీంపేట, KNR 38.1, తాంగుల 38.0, గంగాధర 37.9, వీణవంక 37.8, ఇందుర్తి 37.7, గంగిపల్లి 37.4, గట్టుదుద్దెనపల్లె, పోచంపల్లి 37.3, కొత్తగట్టు 37.2, తాడికల్ 37.1, దుర్శేడ్లో 36.7°C గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి