News March 29, 2024
మందకృష్ణ ఆశయం త్వరలోనే నెరవేరుతుంది: సత్యకుమార్

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావలసిన అవసరముందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నట్లు బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు. ధర్మవరం కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. తన నివాసానికి వచ్చిన మందకృష్ణతో సత్య తాజా రాజకీయాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ ఆశయం త్వరలో నెరవేరుతుందన్నారు.
Similar News
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
అర్జీలు త్వరగా పరిష్కరిస్తాం: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.


