News January 28, 2025

మందమర్రిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

మందమర్రిలోని రైల్వే వంతెన కింద మంగళవారం రైలు ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 – 45 సంవత్సరాలు ఉంటుందని, ఛాతీపై రెండు పాత గాయం మచ్చలు ఉన్నాయని మంచిర్యాల జీఆర్పీ ఎస్ఐ మహేందర్ తెలిపారు. కాగా ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8328512176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News November 4, 2025

అరకు: అవును.. ఇది పాఠశాలే!

image

అరకులోయ మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ పరిధి సూకురుగుడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిధిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉంది. దీంతో 40 మంది విద్యార్థులకు నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనంలోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని గిరిజనులు సోమవారం తెలిపారు. పాలకులు స్పందించి సూకురుగుడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలన్నారు.

News November 4, 2025

ఆ ఊర్లో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే..

image

TG: జగిత్యాల(D) వెల్లుల్ల అనే గ్రామంలో ఏ మూల చూసినా, ఏ వాడ తిరిగినా ఆంజనేయుడి గుళ్లే దర్శనమిస్తాయి. 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న ఈ ఊర్లో దాదాపు 45 హనుమాన్ ఆలయాలున్నాయి. పూర్వం ఇక్కడ నివాసమున్న బ్రాహ్మణ కుటుంబాలు తమ వంశాల వారీగా ఎవరికి వారు ఈ ఆలయాలను నిర్మించుకున్నారట. ఈ అన్ని ఆలయాల్లోనూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించడం విశేషం. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 4, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

image

ఇటీవల భారీ వర్షాలకు మానిపండు తెగులు వరి పంటను ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.