News January 25, 2025
మందమర్రి: ఉత్తమ సింగరేణియన్గా సయ్యద్ అబ్బాస్

గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని మందమరి ఏరియా నుంచి ఉత్తమ సింగరేణియన్గా ఆర్కేపీ ఓసీపీ ఫోర్ మెన్ ఇన్ఛార్జి సయ్యద్ అబ్బాస్ను ఎంపిక చేసినట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. ఈనెల 26న కొత్తగూడెం ఏరియాలోని ప్రకాశం స్టేడియంలో జరగబోయే వేడుకల్లో సింగరేణి సంస్థ సీఎండీ బలరాం చేతులమీదుగా బహుమతి అందుకోనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.
News December 3, 2025
42 రోజులు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 42 రోజుల పాటు ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ అశోక్, అధికారులతో కలిసి ఆయన సైబర్ నేరాల నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
News December 3, 2025
అనంతగిరి కొండల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అటవీ సంరక్షణ చార్మినార్ జోన్ అధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బుధవారం అనంతగిరి కొండల్లో ఎకో టూరిజం అభివృద్ధి పనులను కొండపై అటవీ శాఖ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను, నాటిన మొక్కలను పరిశీలించారు. అడవుల సంరక్షణతో పాటు పర్యాటకులకు అనంతగిరి కొండపై సౌకర్యాలు కల్పించే అభివృద్ధి చేయాలన్నారు.


