News January 7, 2025
మందమర్రి ఏరియాలో పర్యటించిన డైరెక్టర్
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి మందమర్రి ఏరియాలో సోమవారం పర్యటించారు.GM దేవేందర్తో కలిసి ఏరియాలోని KK-OCPసందర్శించి పని ప్రదేశాలను పరిశీలించారు. ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షించారు. రవాణాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు అంకితాభావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువుతుందన్నారు.
Similar News
News January 18, 2025
MNCL: తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే చర్యలు : CP
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాస్పోర్ట్, ఉద్యోగ నియామకాలు, విదేశాలకు వెళ్లేందుకు పోలీస్ కేసులు లేవని క్లియరెన్స్ నిమిత్తం తప్పుడు అఫిడవిట్లు సమర్పించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పోలీస్ వెరిఫికేషన్, క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం కొంతమంది గతంలో కేసులు నమోదైన తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నట్లు తెలిపారు.
News January 17, 2025
దిలావర్పూర్: అటవీ ప్రాంతంలో భార్యాభర్తల SUICIDE
ఇద్దరు భార్యాభర్తలు ఉరేసుకొని మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 17, 2025
మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు
మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.