News March 26, 2025
మందమర్రి: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. యాపల్ ఏరియాకు చెందిన సతీశ్ తన 15 ఏళ్ల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో బాదాడు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI వెల్లడించారు.
Similar News
News April 2, 2025
కొడాలి నాని హెల్త్ UPDATE

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని కొద్దిరోజుల్లోనే డిశ్చార్జ్ కానున్నారు.
News April 2, 2025
మేడ్చల్లో చల్లబడింది.. వర్షం కురిసే CHANCE

మేడ్చల్ వాతావరణంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గరిష్ఠంగా 37.7 డిగ్రీలు నమోదైంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం రైతులకు ఊరట కలిగించనుంది. అయితే రోడ్లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో వెదర్ చల్లబడింది. స్థానికంగా చల్లని గాలులు వీస్తున్నాయి. మీ ప్రాంతంలో ఎలా ఉంది కామెంట్ చేయండి.
News April 2, 2025
సుంకాల ప్రభావం.. భారత్లో తగ్గనున్న బంగారం ధరలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలతో భారత్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. $11.88 బిలియన్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుండగా వీటిపై ట్రంప్ 13.3% సుంకం విధించనున్నారు. దీని ప్రభావంతో భారత్లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎలక్ట్రానిక్ పరికరాలపై సుంకం పెరగడంతో మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.