News March 12, 2025
మందమర్రి: కేకే 5 గనిలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

మందమర్రి ఏరియాలోని KK 5 గని మొదటి షిఫ్ట్ లో జరిగిన ప్రమాదంలో గోలెం సాయి శివ అనే కార్మికుడు గాయపడ్డాడు. 4 సీమ్ 26 దగ్గర దిగి ఉన్న టబ్ ఎక్కించే ప్రయత్నంలో టబ్ ఫ్రేమ్కు రైలుకి మద్య కార్మికుడి ఇరకడంతో కుడి చేయి మధ్య వేలు తెగి పోయింది. హుటాహుటిన కార్మికుడిని రామకృష్ణాపూర్లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 18, 2025
‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
News October 18, 2025
జయశంకర్ జిల్లాలో 1055 మద్యం టెండర్లకు దాఖలు

భూపాలపల్లి జిల్లాలో మద్యం శనివారం సాయంత్రం మద్యం టెండర్లు దాఖలు ముగిశాయి. జయశంకర్, ములుగు జిల్లాలకు 59 షాపులు ఉండగా.. 1055 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు రూ.3 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజులను చెల్లించారు. గతేడాది 59 మద్యం షాపులకు 2161 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే సగం దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది ఇలా ఉంటే మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.
News October 18, 2025
ఖమ్మం కలెక్టర్ను కలిసిన స.హ.చ కమిషనర్

ఖమ్మం కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ అనుదీప్ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, చట్టం నిబంధనలు 4(1)(బి), 6(1) లపై పౌర సమాచార అధికారులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం మార్గం తదితర అంశాలపై కమిషనర్.. కలెక్టర్తో చర్చించారు.