News March 12, 2025

మందమర్రి: కేకే 5 గనిలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

image

మందమర్రి ఏరియాలోని KK 5 గని మొదటి షిఫ్ట్ లో జరిగిన ప్రమాదంలో గోలెం సాయి శివ అనే కార్మికుడు గాయపడ్డాడు. 4 సీమ్ 26 దగ్గర దిగి ఉన్న టబ్ ఎక్కించే ప్రయత్నంలో టబ్ ఫ్రేమ్‌కు రైలుకి మద్య కార్మికుడి ఇరకడంతో కుడి చేయి మధ్య వేలు తెగి పోయింది. హుటాహుటిన కార్మికుడిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 21, 2025

తాడిపత్రిలో ఉద్రిక్తత

image

AP: అనంతపురం(D) తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేత ఫయాజ్ బాషా ఇల్లు అక్రమ నిర్మాణమనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు జేసీబీతో తరలివచ్చారు. దానివెంట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులూ భారీగా వచ్చి ఎదురుదాడి చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

News March 21, 2025

ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్‌ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్

image

జవహర్‌‌నగర్ పరిధిలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (ACDS) బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విద్యార్థుల కోసం 19వ స్నాతకోత్సవ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ప్రిన్సిపల్ డా.మమతా కౌశిక్ కళాశాల నివేదికను సమర్పించారు. ACDS ఛైర్మన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గ్రాడ్యుయేట్లు ఆదర్శవంతంగా పనిచేయాలన్నారు.

News March 21, 2025

BRS వల్ల ఒక జనరేషన్‌ నాశనం: భట్టి

image

TG: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను BRS నాశనం చేసిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ అని ఫైర్ అయ్యారు.

error: Content is protected !!