News July 8, 2024

మందమర్రి: బావిలో మృతదేహం కలకలం

image

మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని కోల్ యార్డు వద్ద బావిలో ఆదివారం యువకుని మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎస్సై మాట్లాడుతూ.. మృతుడు దీపక్ నగర్‌కు చెందిన సూరమల్ల ప్రణయ్(30)గా గుర్తించామని తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 24, 2026

నేడు ఆదిలాబాద్‌కు కేటీఆర్

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను 11 గంటలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.

News February 23, 2026

ఆదిలాబాద్‌లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నాగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

News February 23, 2026

ఆదిలాబాద్: 67 మంది దరఖాస్తు.. కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు

image

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘రేవంత్ అన్న కా సహారా – మిస్కినో కే లియే’ పథకం కింద సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలెక్షన్ కమిటీ (DLSSC) సమక్షంలో మోపెడ్ వాహనాల పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈపథకానికి మొత్తం 67 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.