News July 8, 2024

మందమర్రి: బావిలో మృతదేహం కలకలం

image

మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని కోల్ యార్డు వద్ద బావిలో ఆదివారం యువకుని మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎస్సై మాట్లాడుతూ.. మృతుడు దీపక్ నగర్‌కు చెందిన సూరమల్ల ప్రణయ్(30)గా గుర్తించామని తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News July 5, 2025

సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ADB ఎస్పీ

image

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్‌లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు.

News July 5, 2025

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ బదిలీ

image

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ ఆకస్మిక బదిలీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల నిర్వహణతో పాటు రెవెన్యూ సదస్సుల విజయవంతంలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని (PRRD) విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News July 5, 2025

ADB: బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై కేసు నమోదు

image

బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ మదీనా హోటల్‌లో బాల కార్మికుడితో పని చేయించుకుంటున్న యజమాని అబ్దుల్ హసీబ్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. అదేవిధంగా మాంసం దుకాణ యజమాని ప్రవీణ్, మదీనా బెడ్ వర్క్ యజమాని షేక్ ఫరీద్‌పై కార్మిక శాఖ అధికారి శంకర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు 1 టౌన్ సీఐ సునీల్ చెప్పారు.