News March 31, 2025
మందమర్రి: బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామన్ కాలనీ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి యువకుడు కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు 108 ద్వారా చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 25, 2025
IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచులు(16 పాయింట్లు) గెలవాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం ఆయా జట్లు కింది సంఖ్యలో మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
* గుజరాత్ టైటాన్స్(GT)- 2, DC- 2, RCB-2,
* PBKS-3, LSG-3, MI-3
* KKR-5, SRH-6, CSK-6
* RR-అవకాశాలు లేనట్లే.
News April 25, 2025
సదాశివనగర్ మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం

సదాశివనగర్ మండలం ఉత్తనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆరోగ్య సిబ్బంది ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ సాయికుమార్ మాట్లాడుతూ.. దోమల వల్ల కలిగే వ్యాధులపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. దోమలు పుట్టకుండా, జాగ్రత్తలు తీసుకునేలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపామన్నారు. సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.
News April 25, 2025
షీల్డ్ కవర్లో ఛైర్మన్ అభ్యర్థి పేరు..!

కుప్పం మున్సిపల్ ఛైర్మన్ గిరి కోసం అధికార పార్టీలో పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఛైర్మన్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్లో పంపిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఛైర్మన్ గిరి కోసం 20వ వార్డు కౌన్సిలర్ సోము, 19వ వార్డు కౌన్సిలర్ దాముతో పాటు 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ పోటీపడుతుండగా సీఎం నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అన్న అంశం సస్పెన్స్గా మారింది.